కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే...

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే...
x
Highlights

ప్రధాని మోడీ, నీరవ్‌మోడీ జేబులో డబ్బులు వేస్తారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారత్‌లోని పేదవాళ్ల జేబుల్లో డబ్బులేస్తానని కాంగ్రెస్...

ప్రధాని మోడీ, నీరవ్‌మోడీ జేబులో డబ్బులు వేస్తారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారత్‌లోని పేదవాళ్ల జేబుల్లో డబ్బులేస్తానని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శంషాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ నీరవ్‌ మోడీని పట్టుకుని డబ్బును పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడమే కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కేవలం పదిరోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తానని ఇప్పటికే తాను ప్రకటించిన విషయాన్ని మరోసారి రాహుల్‌ గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories