ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
x
Highlights

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ సునిల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లతో సమావేశమయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల...

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ సునిల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లతో సమావేశమయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో 19 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపించాలన్న టీడీపీ ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని సీఈసీని ప్రశ్నించారు. ఆరోరాతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ కు ఆదేశాలు ఎలా జారీచేస్తారంటూ నిలదీసినట్టు వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయాలను చూశానని, కానీ ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఈసీ నడుచుకుంటోందని, ఈసీ పనితీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిరావడం విచారించాల్సిన విషయం అని పేర్కొన్నారు. పోలింగ్ జరిగిన తర్వాత రోజు రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా రీపోలింగ్ ప్రకటన చేస్తారని, కానీ, నెలరోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేస్తే ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ కు ప్రకటన చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories