నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసు జారీ

నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసు జారీ
x
Highlights

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నికలో...

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారంటూ 2017 ఆగస్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉందని వెల్లడించింది. బాలకృష్ణ వాదనలు తెలుసుకోవడం తప్పని సరిని భావించి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories