కేసీఆర్ పాలనలో రాష్ట్రం దూసుకెళ్తోంది: గవర్నర్

కేసీఆర్ పాలనలో రాష్ట్రం దూసుకెళ్తోంది: గవర్నర్
x
Highlights

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నర్సింహన్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నర్సింహన్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందన్న గవర్నర్‌ యావత్‌ దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నర్సింహన్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందన్న గవర్నర్ నర్సింహన్‌ రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి అభినందించిందని తెలిపారు. గవర్నర్ నర్సింహన్‌‌తో కలిసి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో అమర జవాన్ల స్థూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories