జియో వినియోగదారులకు శుభవార్త!

జియో వినియోగదారులకు శుభవార్త!
x
Highlights

రిలయన్స్ జియో సంస్థ మరోసారి తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే జియో ప్రైమ్ సభ్యత్వం ఉన్నవాళ్లు ఎలాంటి రుసుము చెల్లించనవసరంలేకుండానే...

రిలయన్స్ జియో సంస్థ మరోసారి తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే జియో ప్రైమ్ సభ్యత్వం ఉన్నవాళ్లు ఎలాంటి రుసుము చెల్లించనవసరంలేకుండానే ఏడాదిపాటు ప్రైమ్ సేవల కొనసాగింపు పొందవచ్చు. ఈ మేరకు ప్రైమ్ సభ్యత్వాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జియో ప్రైమ్ ద్వారా వినియోగదారులు అనేక యాప్స్ ను యాక్సెస్ చేసుకోవడంతోపాటు, ఎన్నెన్నో బంపర్ ఆఫర్లు పొందే వీలుంటుంది.

జియో ప్రైమ్ సభ్యులు తమ మై జియో యాప్ లో వెళ్లడం ద్వారా పొడిగింపు ఆఫర్ తమకు అందుబాటులోకి వచ్చిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. వాస్తవానికి జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక ఆఫర్ కారణంగా పైసా చెల్లించనక్కర్లేకుండానే ఏడాదిపాటు ఆటో రెన్యువల్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories