పెళ్లయితే తాగడం మానేస్తావా? అంటూ ఫ్రెండ్‌ని..

పెళ్లయితే తాగడం మానేస్తావా? అంటూ ఫ్రెండ్‌ని..
x
Highlights

ఎక్కడైనా ఎవరైన మద్యం తాగడం బంద్ పెట్టిన అంటే ఫుల్ ఖుషి అవుతారు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ పో శభాష్ అని అంటారు కదా! అయితే ఆ దోస్తు మాత్రం మందు తాగుడు...

ఎక్కడైనా ఎవరైన మద్యం తాగడం బంద్ పెట్టిన అంటే ఫుల్ ఖుషి అవుతారు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ పో శభాష్ అని అంటారు కదా! అయితే ఆ దోస్తు మాత్రం మందు తాగుడు బంద్ చేసినందుకు వాళ్ల దగ్గరి దొస్తుని పొట్టుపొట్టు కొట్టిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్ పాల్ అనే వ్యక్తి మీద ఈ దాడి జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే అమృత్ పాల్ గతంలో వాళ్ల స్నేహితులతో కలిసి రోజూ పీకలదాక మద్యం సేవించేవాడు. ప్రెండ్స్‌తో కలిసి రోజూ ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. ఈ కమ్రంలోనే అమృత్ పాల్‌కు వివాహమైంది. ఈ క్రమంలో అమృత్ పాల్ మద్యం మానేస్తున్నట్టు ఒకరోజు వాళ్ల స్నేహితులకు చెప్పాడు.

అయితే అమృత్ పాల్ మాటలు కొంచెం కూడా లెక్కచేయని అతని ఫ్రెండ్స్ తమతో పాటు మద్యం తాగాల్సిందేనంటూ గొడవ చేశారు. మీరు ఎంత తాగమాని బ్రతిమిలాడినా కానీ తాను మద్యం తాగనని స్పష్టం చేశాడు. దీంతో అమృత్ మీద కోపం పెంచుకున్న అతడి స్నేహితులు ఓ రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి అమృత్ ఇంటిపై దాడి చేశారు. అడ్డువచ్చిన అమృత్ పాల్‌తో పాటు అతడి భార్య, కుటుంబసభ్యులను కూడా చావబాదారు. పెళ్లయితే మద్యం మానేస్తావా? అంటూ అమృత్ ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories