అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...ఐదుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...ఐదుగురి మృతి
x
Highlights

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు...

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ షికాగోకు 65 కి.మీల దూరంలోని అరోరా ప్రాంతంలోని పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమలో ఈ దారుణం చోటుచేసుకుంది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్‌ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. స్పందించిన పోలీసులు వెంటనే ఉన్మాదిని మట్టుబెట్టారు. కాల్పులు జరపడానికి గల కారణమేంటో తెలియరాలేదు. ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌లో 17 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఘటన జరిగి ఏడాది పూర్తయిన మరుసటి రోజే ఈ దారుణం చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories