శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు

శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు
x
Highlights

తిరుమల శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి అలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను...

తిరుమల శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి అలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. మరోవైపు ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో సుమారు 100 మందికి పైగా సిబ్బంది అతికష్టంమీద మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి ఎర్రచందనం స్మగ్లర్లే కారణమై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు, సుమారు 5 హెక్టార్ల అటవీ ప్రాంతం ఈ మంటల్లో దగ్ధం అయిందని, అరుదైన వృక్ష, పక్షి జాతులు ఈ మంటలతో నాశనం అవుతున్నాయని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories