పెండ్లి రిసెప్షన్‌లో డీజే గలాటా..

పెండ్లి రిసెప్షన్‌లో డీజే గలాటా..
x
Highlights

హైదరాబాద్‌ గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహ రిసెప్షన్‌లో అల్లరిమూకలు దాడి చేయడంతో నూతన వధూ వరులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి....

హైదరాబాద్‌ గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహ రిసెప్షన్‌లో అల్లరిమూకలు దాడి చేయడంతో నూతన వధూ వరులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెండ్లి రిసెప్షన్‌లో డీజే సౌండ్ వివాదం సృష్టించింది. చిలికి చిలికి గాలివానగా మారి పెను వివాదానికి దారి తీసింది. పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం గాజులరామారం సర్కిల్, సూరారంలోని న్యూశివాలయనగర్‌కు చెందిన ఎదుగాని బాలమణి, నారాయణ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో ముగ్గురు కుమారుల వివాహాలు జరుగగా, మిగిలిన చిన్న కుమారుడు సాయిశంతన్‌కుమార్ వివాహం మే 29న నిజామాబాద్‌కు చెందిన యువతితో జరిగింది. మరునాడు అంటే 30న రాత్రి పెళ్లి కుమారు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా రిసెప్షన్‌లో (డీజే) సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు.

బాలమణి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో ఉండగా డీజేలో సౌండ్ పెంచండి అని అక్కడున్న వారు కోరారు. ఈ విషయంలో డీజే ఆపరేటర్, బాలమణి కుటుంబ సభ్యులు మాటమాట పెంచుకున్నారు. ఇక దీంతో చేసేది ఏం లేక డీజే ఆపరేటర్ తన మిత్రులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. వెంటనే సుమారు 10మంది యువకులు బైక్‌లపై చేరుకొని రిసెప్షన్‌లోని కుర్చీలు, స్టేజీలు, వంట పాత్రలను చెల్లచెదురు చేశారు. వీరితో పాటు మరో 15మంది దుండగులు చేరి కర్రలతో పెళ్లింట్లో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రిసెప్షన్‌కు వచ్చిన బందువులు కూడా గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories