మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
x
Highlights

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యాదయ్య అనే రైతుకు...

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యాదయ్య అనే రైతుకు చెందిన రెండెకరాల పొలం పక్కనే ఉన్న యాదిరెడ్డి అనే రైతు కబ్జా చేశాడంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నాడు. ఇవాళ గ్రీవెన్స్‌ డే కావడంతో రెవెన్యూ మీటింగ్‌ హాల్‌కు వచ్చిన రైతు యాదయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories