టీఆర్‌ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి...3న నర్సాపూర్‌...

టీఆర్‌ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి...3న నర్సాపూర్‌...
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత...

తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3న ఆమె కారెక్కడం ఖాయంగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో ఆమె ఇప్పటికే సమావేశమయ్యారు. వచ్చే నెల 3న నర్సాపూర్ లో టీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

కొద్దిరోజులుగా పార్టీ తీరుపై సునీతా లక్ష్మారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మెదక్ నుంచి లోక్ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం ప్రయత్నించినా అధిష్టానం స్పందించకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలో చేరతారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. బీజేపీని కాదని ఇప్పుడు టీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోతుంటే ఇటు పార్టీలో సీనియర్లు కూడా హ్యాండిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అలాగే రాపోలు ఆనంద భాస్కర్, చిత్తరంజన్ దాస్‌లు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా సునీతా లక్ష్మారెడ్డి కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories