చంద్రబాబుకి మరో షాక్ ..ఈవీఎంలు 100 శాతం కరెక్ట్ అన్న ఈసీ

చంద్రబాబుకి మరో షాక్ ..ఈవీఎంలు 100 శాతం కరెక్ట్ అన్న ఈసీ
x
Highlights

జరిగిన ఏపి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు అయిన చంద్రబాబుకి ఈసీ మరో షాక్ ని ఇచ్చింది .. ఈసారి జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై వచ్చిన...

జరిగిన ఏపి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు అయిన చంద్రబాబుకి ఈసీ మరో షాక్ ని ఇచ్చింది .. ఈసారి జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేల్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలలో ఓటింగ్‌ను వీవీప్యాట్ స్లిప్పులతో పోల్చి చూడగా... 100 శాతం కచ్చితత్వం కనిపించిందని స్పష్టం చేసింది ఈసీ.

ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి మొత్తం 22లక్షల 30 వేల బ్యాలెట్ యూనిట్లు, 16లక్షల 30వేల కంట్రోల్ యూనిట్లు, 17లక్షల 30వేల వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం EVMల కౌంటింగ్ తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచీ లాటరీ ద్వారా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను, ఈవీఎంలలో ఓటింగ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు సరిపోల్చిచూశారు.

ఎక్కడా ఎలాంటి తేడా జరగకపోవడం విశేషం. దీన్ని బట్టీ, కేంద్రంలోని బీజేపీకీ, ఏపీలోని వైసీపీకీ, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు పడినవి ఒరిజినల్ ఓట్లేనని తేలిపోయింది. ఇకపై ఎవరూ EVMలపై ఆరోపణలు చేయడానికి వీల్లేకుండా లెక్కలతో సహా వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories