ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌...ముగ్గురు కరడుకట్టిన నేరగాళ్ల హతం

ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌...ముగ్గురు కరడుకట్టిన నేరగాళ్ల హతం
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో కరడు కట్టిన నేరస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని ఓ పార్కు వద్ద...

దేశ రాజధాని ఢిల్లీలో కరడు కట్టిన నేరస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని ఓ పార్కు వద్ద నీరజ్ బవానియా గ్యాంగ్ కు చెందిన నేరగాళ్లు దాడి చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయాలయిన ముగ్గురు నేరస్థులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులకు బుల్లెట్ల గాయాలయ్యాయి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో ముప్పు తప్పింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దోపిడీ దొంగలు అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గుర్తించారు. ఘటన స్థలం నుంచి పోలీసులు పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories