తుది ఘట్టానికి ప్రచారం సమాప్తం

తుది ఘట్టానికి ప్రచారం సమాప్తం
x
Highlights

సార్వత్రికల ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఏడూ విడతలుగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో చివరిదైన ఎదో విడత లో ఎన్నికలు నిర్వహించనున్న స్థానాల్లో...

సార్వత్రికల ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఏడూ విడతలుగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో చివరిదైన ఎదో విడత లో ఎన్నికలు నిర్వహించనున్న స్థానాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం మొగిసింది. ఈ నెల 19న లోక్‌సభ తుది విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 19న పోలింగ్‌ ముగిశాక, సాయంత్రం 6 గంటల అనంతరం ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడనున్నాయి. ఈ నెల 23న లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కీలకమైన 13 స్థానాలకు చివరి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 167 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి విడత ఎన్నికల బరిలోనే ఉంది. దీంతోపాటు పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పశ్చిమ బంగాల్‌లోని 9 స్థానాలకు, బిహార్‌లో 8 పార్లమెంటు స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాలకు, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, ఝార్ఖండ్‌లో 3, ఛండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, శత్రుఘ్నసిన్హా, హర్‌ సిమ్రత్‌ కౌర్‌ తదితరులు ఈ విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాగా, పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిన్ననే (గురువారమే) ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసిన సంగతి విదితమే.

Show Full Article
Print Article
Next Story
More Stories