కడపలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్'‌: ఈసీ సీరియస్‌!

కడపలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: ఈసీ సీరియస్‌!
x
Highlights

రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి...

రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో వర్షాలు వల్ల స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత పెంచామని, భారీ వర్షాలు వచ్చినా ఈవీఎంలు తడిచే అవకాశం లేదన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కడపలో 2 థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన జేసీపై చర్యలకు సిఫార్సు చేశామని ద్వివేది పేర్కొన్నారు. సంబంధిత థియేటర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories