ఏపీలో రీపోలింగ్‌ ఎక్కడంటే..!

ఏపీలో రీపోలింగ్‌ ఎక్కడంటే..!
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల దృష్ట్యా 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల దృష్ట్యా 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు సిఫారసు చేసినట్లు జీకే ద్వివేది చెప్పారు. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు ఈవీఎంల్లో లోపాలు తలెత్తిన ఐదు కేంద్రాలను గుర్తించిన సీఈసీకి పంపారు. తాజాగా ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం 94వ పోలింగ్ కేంద్రం‌, గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు244వ పోలింగ్‌ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్‌ కేంద్రం, సూళ్లురుపేటలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, ఇక ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్‌ కేంద్రాలలో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ద్వివేది ఈసీని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories