యోగి‌, మాయావతిపై ఈసీ కొరడా

యోగి‌, మాయావతిపై ఈసీ కొరడా
x
Highlights

ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా యోగి ఆదిత్యానాథ్ పై మూడు రోజులు, మాయావతిపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. యోగి 72 గంటల పాటు, మాయావతి 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. యోగి ఆదిత్యానాథ్ చేసిన 'అలి, భజరంగ్ బలి' వ్యాఖ్యలను, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దంటూ ముస్లింలకు మాయావతి పిలుపు నివ్వడాన్ని ఈసీ తప్పుబట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories