తల్లిలేని పిల్లని చేరదీసి,చదివించి పెళ్లి చేసిన టీఆర్ఎస్ ఎమెల్యే ..

తల్లిలేని పిల్లని చేరదీసి,చదివించి పెళ్లి చేసిన టీఆర్ఎస్ ఎమెల్యే ..
x
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఆడపిల్ల అంటే తల్లితండులకు బరువైపోతుంది .. కానీ ఏ సంబంధం లేని ఓ ఆడపిల్లకు అన్ని తానై ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఆడపిల్ల అంటే తల్లితండులకు బరువైపోతుంది .. కానీ ఏ సంబంధం లేని ఓ ఆడపిల్లకు అన్ని తానై ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇప్పించి తీరా తను కోరుకున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేసారు..దుబ్బాక టీఆర్ఎస్ ఎమెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులు..

సిద్ధిపేట జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఉండే సావిత్రికి, కామారెడ్డి మండలానికి చెందిన సాయాగౌడ్ కు పెళ్లయింది. వీరికి రేఖ అనే పాప పుట్టింది. భార్య సావిత్రిని కరెంట్ షాక్ ఇచ్చి చంపేసాడు సాయాగౌడ్. ఇక తన కూతురు అయిన రేఖను (17) అమ్మేయాలి అనుకున్నాడు .

సోలిపేట రామలింగారెడ్డి అమ్మమ్మ గారి ఇల్లు చిట్టాపూర్ కావడంతో రేఖ ఆయన్ని ఆశ్రయించింది. దీనితో రేఖ పూర్తి భాధ్యతలు రామలింగారెడ్డి దంపతులు తీసుకున్నారు .. మంచిగా చదివించి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు ..

అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సురేష్ తో రేఖకు ప్రేమ ఏర్పడడంతో తన ప్రేమ ప్రస్థావన రామలింగారెడ్డి దంపతుల ముందు ఉంచింది . ఆమె ఇష్టాన్ని గౌరవించి నిన్న బుధవారం వారికీ అంగరంగవైభవంగా వివాహం జరిపించారు .. అందరికి ఆదర్శంగా నిలిచారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories