పేషెంట్‌ని చితకబాదిన డాక్టర్.. వీడియో వైరల్

పేషెంట్‌ని చితకబాదిన డాక్టర్.. వీడియో వైరల్
x
Highlights

డాక్టర్ పేషెంట్ పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని సవాయిమన్ సింగ్...

డాక్టర్ పేషెంట్ పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని సవాయిమన్ సింగ్ మెడికల్ హాస్పిటల్ లోని డాక్టర్ సునీల్ హాస్పిటల్ కు వచ్చిన రోగిని చితక బాదారు. ఆయన వార్డు నంబర్ 1 సీ లోని రోగిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఏదో విషయమై డాక్టర్‌కు, ఆ రోగి బంధువులకు మధ్య వాగ్వాదం జరగడంతోనే డాక్టర్ సునీల్ ఆ రోగిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా దీనిపై రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్ విచారణకు ఆదేశించగా అటు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కూడా ఈ ఘటన పై వివరణ కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories