టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
x
Highlights

కడప జిల్లా రాజంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలోఉద్రిక్తత నెలకొంది. సమావేశంపై సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప జిల్లా రాజంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలోఉద్రిక్తత నెలకొంది. సమావేశంపై సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడాకు మద్దతుగా ఆయన అనుచరులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయుల ఆందోళనపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప విమర్శలు చేయడం తగదన్నారు. పార్టీ మారే వాళ్లు వెళ్లిపోవచ్చు ఎవ్వరు వెళ్లిన టీడీపీకి నష్టం లేదన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఈ భేటీకి మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి, తదితరులు హాజరయ్యారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో సహా టీడీపీకి చెందిన కొందరు వైసీపీలోకి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22న అమరావతిలో సీఎం చంద్రబాబు కూడా రాజంపేట టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories