జగన్‌కు జై కొట్టిన దగ్గుబాటి

జగన్‌కు జై కొట్టిన దగ్గుబాటి
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వ్రరావు వైసీపీలో చేరనున్నారు. జగన్ తో భేటీ అయిన దగ్గుబాటి తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరుతామని ప్రకటించారు. పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వ్రరావు వైసీపీలో చేరనున్నారు. జగన్ తో భేటీ అయిన దగ్గుబాటి తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరుతామని ప్రకటించారు. పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని చెప్పారు.

ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. కుమారుడు హితేశ్ తో కలిసి వైసీపీలో చేరుతామని ప్రకటించారు. లోటస్ డ్ లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు దగ్గుబాటి. తమ నిర్ణయాన్ని జగన్ స్వాగతించినట్లు చెప్పారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించి మంచి రోజు చూసుకుని వైసీపీలోకి వస్తామన్నారు. తన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు.

ఏపీలో పాలన గాడి తప్పిందని ప్రజల సొమ్మును దీక్షల పేరుతో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని దగ్గుబాటి ఆరోపించారు. ఓవైపు నిధులు లేవంటూనే, మరోవైపు ధర్మపోరాట దీక్షలకు కోట్లు ఖర్చుపెడుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ స్థానాన్ని దగ్గుబాటి కుటుంబం కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి హామీ ఇచ్చారన్న దానిపై స్పష్టత రాలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories