చంద్రబాబును చూస్తే జాలేస్తోంది..!

చంద్రబాబును చూస్తే జాలేస్తోంది..!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు. దగ్గుబాటి మీడియా సమావేశం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు. దగ్గుబాటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వద్దంటే వద్దన్నారని దగ్గుబాటి విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా చంద్రబాబే కడుతున్నానని అంటున్నారన్నారు. రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారని మండిపడ్డారు. రాయపట్నం పోర్టుకు రాష్ట్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని అన్నారు. చంద్రబాబును చూస్తంటే జాలేస్తోందని అన్నారు. సీఎం కూర్చీలో నేను ఉండి ఉంటే.. ఒక్క గంట కూడా కూర్చోలేను. వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అలాగే పార్లమెంట్‌లో అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం ఉన్నాకానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ అంశాన్నే పట్టించుకోలేదు. అప్పటి స్పీకర్ మీరాకుమార్‌కు పురందేశ్వరి విజ్ఞప్తి చేయడంతో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం పార్లమెంట్‌లో పెట్టే అవకాశం లభించిందని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories