కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరిద్దరే

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరిద్దరే
x
Highlights

తెలంగాణలో ఎన్నికల కొలహాలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష నేతలు రేడి అవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను...

తెలంగాణలో ఎన్నికల కొలహాలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష నేతలు రేడి అవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని ప్రకటించారు. ఇది ఇలా ఉంటే పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి రేసులో ఉన్న విషయం తెలిసిందే కాగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన చేయడంతో గురువారం నారాయణరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories