జగన్‌పై ఫరూక్ ఆరోపణలు.. ఖండించిన కాంగ్రెస్

జగన్‌పై ఫరూక్ ఆరోపణలు.. ఖండించిన కాంగ్రెస్
x
Highlights

దివంగత నేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక తరువాత ముఖ్యమంత్రి కావాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భావించరని, వైఎస్ మృతి చెందాక తనను సీఎం...

దివంగత నేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక తరువాత ముఖ్యమంత్రి కావాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భావించరని, వైఎస్ మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్'కు రూ.1500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పినట్టు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నిన్న కడప జిల్లాలో టీడీపీ ప్రచారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కాగా దీనిపై ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. వైయస్ మరణం తరువాత సీఎం అయ్యేందుకు ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు సేకరించడంతో పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని, కానీ కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇస్తానని అన్నది నిరాధారమైన ఆరోపణ అని దాసోజు శ్రవణ్ అన్నారు. అయితే వైయస్ మృతి తరువాత ఆ నాడు సోనియా గాంధీ రోశయ్యను ఎంపిక చేశారని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories