నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్

నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు సీఎం కేసీఆర్. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరీక్షించడానికి క్షేత్రస్థాయి ఇవాళ పరిశీలనకు...

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు సీఎం కేసీఆర్. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరీక్షించడానికి క్షేత్రస్థాయి ఇవాళ పరిశీలనకు వెళ్తున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద ఉన్న పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులను పరిశీలించనున్నారు.

ఇటీవలే మేడిగడ్డతో పాటు కన్నెపల్లి పంప్ హౌస్, తెలంగాణ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత కీలకమైంది కావడంతో స్వయంగా మరోసారి పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల బిగింపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తయితేనే కన్నె పంపుహౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయగలరు. అందుకే మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్తున్నారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories