ఏపీలో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం

ఏపీలో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం
x
Highlights

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం...

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ ప్రచారంలోనూ ముందుంది. నిన్న ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రచారం చేసిన అధినేత జగన్ ఈ రోజు రాయలసీమ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకోనున్న జగన్ పార్టీ అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పార్టీ అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డికి మద్ధతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం సొంత జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. మధ్యహ్నం 12 గంటలకు నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories