రీ పోలింగ్‌ నిర్ణయం ఖండిస్తున్నా: చంద్రబాబు

రీ పోలింగ్‌ నిర్ణయం ఖండిస్తున్నా: చంద్రబాబు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని...

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చాలా పోలింగ్‌ బూత్‌లలో పోలింగ్‌ నిర్వహణపై అనేక ఫిర్యాదులు అందాయని అలాగే ఆ నియోజకవర్గంలో భారీగా ఓటర్లను తొలగించిన విషయంపైనా ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రీ పోలింగ్‌ కోసం గత నెల 12 నే టీడీపీ ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదన్నారు. టీడీపీ చేస్తున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కనపెట్టడం ఎంతో బాధిస్తుందన్న చంద్రబాబు వైసీపీ చేస్తున్న కంప్లైంట్లపై ఆఘమేఘాలపై స్పందించడం దారుణమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories