డేటా కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్: చంద్రబాబు

డేటా కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్: చంద్రబాబు
x
Highlights

డేటా చోరి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిగ్ మారింది. ఈ డేటా చోరి ఇప్పుడు ఇరు రాష్ట్రాల నాయకులకు ముచ్ఛేమటలు పెట్టిస్తోంది. డేటా చోరిపై...

డేటా చోరి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిగ్ మారింది. ఈ డేటా చోరి ఇప్పుడు ఇరు రాష్ట్రాల నాయకులకు ముచ్ఛేమటలు పెట్టిస్తోంది. డేటా చోరిపై ఇటు అధికార, ప్రతిక్ష నేతల మాటల తూటలతో ఇరుపార్టీల మధ్య ఓ యుధ్దన్నే తలపిస్తోంది. ఇరువురు ఒకరిపై మరోకరు పోలీసులు ఠాణాలో ఫిర్యాదు చేసుకుంటున్న విషయం తెలిసిందే కాగా దీనిపై నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డేటాచోరి కుట్రకు ఢిల్లీలోనే పథకం వేశారని ఆరోపించారు. కుట్ర, కుతంత్రం అన్నీ ఆధారాలతో సహా దొరికాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా దొంగతనం చేసిన వారు ఎప్పటికైనా దొరక్కుండాపోరని చంద్రబాబు వ్యాఖ్యనించారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై దాడులు చేయడం చట్ట విరుద్ధమన్నారు. డేటా మొత్తం దొంగిలించుకుని పోయారని నారా చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా పోతే అసలు మాకు ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నిలదీశారు. పైగా మా డేటా దొంగిలించి మాపైనే కేసులు పెడతారా? అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories