జగన్‌కు ఓటేస్తే అదే జరుగుతుంది: చంద్రబాబు

జగన్‌కు ఓటేస్తే అదే జరుగుతుంది: చంద్రబాబు
x
Highlights

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నమరింత హీట్...

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నమరింత హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటలతో రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో దారితప్పి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కప్పం కట్టాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. గతంలో నిజాంకు అలా కప్పం కట్టేవాళ్లని చంద్రబాబు గుర్తుచేశారు. కాగా వైసీపీ అభ్యర్థుల లిస్ట్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే ఫైనల్ చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో లిస్ట్ తీసుకోని మన ఏపీలో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఓట్లు తీసేసే టెక్నాలజీని జగన్‌ మోహన్ రెడ్డికి ఇచ్చారని బాబు ఆరోపించారు. సామంతరాజ్యం కోసమే సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఏపీలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నియమించుకున్నారన్నారు. ఏపీలో జగన్‌, కేసీఆర్‌, మోదీ కుట్రలు పన్నితే ఖబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories