ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీ కాంగ్రెస్‌ దృష్టి..

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీ కాంగ్రెస్‌ దృష్టి..
x
Highlights

సారు, కేసీఆరు పదహారు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంనేందుకు కాంగ్రెస్ సమాయత్తామవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన...

సారు, కేసీఆరు పదహారు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంనేందుకు కాంగ్రెస్ సమాయత్తామవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కనేతృత్వంలో సీఎల్పీ నేతలు గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేలా ఎన్నికల ప్రచారం నిర్వహించే అంశాలపై చర్చించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు జగ్గరెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జీవన్‌రెడ్డిలు హాజరయ్యారు. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య హజరుకాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories