ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం

ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం
x
Highlights

పీయూష్ గోయల్ బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత, కేంద్రమాజీమంత్రి చిదంబరం విమర్శలు చేశారు. ఓటాన్ అకౌంట్ కాదని అకౌంట్ ఫర్ ఓట్స్ అని ఆయన విమర్శలు గుప్పించారు....

పీయూష్ గోయల్ బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత, కేంద్రమాజీమంత్రి చిదంబరం విమర్శలు చేశారు. ఓటాన్ అకౌంట్ కాదని అకౌంట్ ఫర్ ఓట్స్ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ జిమ్మిక్కులు చేశారన్నారు. కప్పు టీ ఉచితం అని చెబుతూ ముడి సరుకు రేట్లు పెంచినట్లుందన్నారు మరో 3 నెలలు వేచి ఉంటే కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని చిదంబరం వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో సంతోషించదగ్గ అంశాలు లేవన్నారు. రైతులకు రోజుకు 17 రూపాయలు ఇస్తే సంతోషించాలా? అని ప్రశ్నించారు. విద్య, ఉపాధి గురించి ప్రస్తావించలేదని వెల్లడించారు. పది పాయింట్ల దార్శనిక పత్రంలో ఈ రెండు అంశాలు లేవని చిదంబరం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories