తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
x
Highlights

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కీలక పదవి దక్కింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్...

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కీలక పదవి దక్కింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులయ్యారు. చెవిరెడ్డి గతంలో కూడా తుడా చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది.13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను పార్టీ కైవసం చేసుకుంది. అయితే చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి సీఎం జగన్ అవకాశం కల్పించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామికి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు దక్కింది. నగరి ఎమ్మెల్యే రోజాకు ఈ దఫాలో చోటు దక్కలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories