ఎగ్జిట్‌పోల్స్‌ పై చంద్రబాబు ఏమన్నారంటే!

ఎగ్జిట్‌పోల్స్‌ పై చంద్రబాబు ఏమన్నారంటే!
x
Highlights

ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం...

ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నాడి పట్టుకోవడంలో సర్వేలు మరోసారి విఫలమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఇక 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్ నుండి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు చంద్రబాబు. వీవీప్యాట్లు, ఈవీఎం ఓట్లలో తేడా ఉంటే అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని నారా చంద్రబాబు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories