జవాన్ల కుటుంబాలకు సహాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

జవాన్ల కుటుంబాలకు సహాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి...

అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories