రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ

రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ
x
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో సమావేశమయ్యారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్‌ 9న ఢిల్లీలో సుమారు 28 రాజకీయ పార్టీలతో జరిగిన భేటీకి కొనసాగింపుగా చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసిన ఆయన ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండాను పూర్తిస్థాయిలో ఖరారు చేసే లక్ష్యంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జాతీయ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories