మోడీ ఆదేశాల మేరకే కేసీఆర్‌ దాడులు..

మోడీ ఆదేశాల మేరకే కేసీఆర్‌ దాడులు..
x
Highlights

ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఐటీ గ్రిడ్‌ డేటా వ్యవహారం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనే...

ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఐటీ గ్రిడ్‌ డేటా వ్యవహారం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనే యోచనతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని పలువురు మంత్రులు ఆరోపించారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేసే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఎన్నికల సమయంలో న్యాయ పోరాటం చేయడం వల్ల జరిగే పరిణామాలపై చర్చించాలని సీనియర్ మంత్రులు సూచించనట్టు సమాచారం. ఇదే సమయంలో న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పలువురు మంత్రులు సూచించారు. జగన్‌కు సాయం చేయాలనే దురుద్దేశంతో ప్రధాని ఆదేశాల మేరకు కేసీఆర్ ఇలాంటి దాడులు చేయిస్తున్నారంటూ పలువురు మంత్రులు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories