మే 23 తర్వాత విజయసాయికి జీవీఎల్ గతే: బుద్ధా

మే 23 తర్వాత విజయసాయికి జీవీఎల్ గతే: బుద్ధా
x
Highlights

దేశంలో బీజేపీ పరిస్థితి జీవీఎల్ పై విసిరిన చెప్పు చెప్పకనే చెపుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. మే 23 తర్వాత వైసీపీ నేత విజయసాయిరెడ్డికి...

దేశంలో బీజేపీ పరిస్థితి జీవీఎల్ పై విసిరిన చెప్పు చెప్పకనే చెపుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. మే 23 తర్వాత వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కూడా బీజేపీ నేత జీవీఎల్ నరసింహన్ ను పట్టిన గతే పడుతుందన్నారు. ఇక విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ పై రోజుకో ట్విట్ పెడుతున్నారని విజయాసాయి రెడ్డి చరిత్ర మొత్తం జేడీ వద్దే ఉంది కదా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. జీవీఎల్ పై చెప్పులు విసిరినట్లు విజయసాయిరెడ్డికి మే23 తర్వాత చెప్పుదెబ్బలు తప్పవన్నారు. ఇక జగన్ వస్తాడని ఆ పార్టీ నేతల ప్రచారానికే ప్రజలు భయ పడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories