ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?

ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?
x
Highlights

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారు అభ్యుర్థులు. అయితే ఓ గ్రామంలో మాత్రం వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్థి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లతో దర్శనం ఇచ్చాయి.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారు అభ్యుర్థులు. అయితే ఓ గ్రామంలో మాత్రం వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్థి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లతో దర్శనం ఇచ్చాయి. ఇక దీంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు కాలనీ వాసులు. ఈ సంఘటన ఆలేరు మండలం రఘనాథపురంలో చోటుచేసుకుంది. రఘనాథపురం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేశ్ ఈ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి నాగేశ్ ఇంటి ముందు మంత్రాలు చేసిన గుడ్డు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు ప్రత్యేక్షమయ్యాయి. ఇగ దీంతో ఆ కాలనీ వాసులు భయందోళనకు గురవుతున్నారు. మరీ ఎన్నికల్లో ఓడించేందుకే పన్నగం పన్నారా లేక మరేవిధంగానైనా కుటుంబాన్ని నష్ట పరిచేందుకు చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories