కేసీఆర్‌ పగటి కలలు మానుకో.. : లక్ష్మణ్‌

కేసీఆర్‌ పగటి కలలు మానుకో.. : లక్ష్మణ్‌
x
Highlights

కేంద్రంలో మళ్లీ బీజేపీ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మరోక్కసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానిమంత్రిగా కొనసాగుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

కేంద్రంలో మళ్లీ బీజేపీ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మరోక్కసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానిమంత్రిగా కొనసాగుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనటం హాస్యాస్పదమని, ఇకనైనా కేసీఆర్ పగటి కలలు కనటం మానుకోవాలని లక్ష్మణ్‌ హితవు పలికారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో డా. లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతోందని, రాష్ట్రంలో గౌరవప్రదమైన సంఖ్యలో అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories