తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు

తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు
x
Highlights

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌, కరీంనగర్‌‌లలో పర్యటించాల్సిన ఉన్నా పర్యటన రద్దయ్యింది....

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌, కరీంనగర్‌‌లలో పర్యటించాల్సిన ఉన్నా పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు అమిత్‌షా వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. అమిత్‌షా రాకపోయినా పార్టీ శ్రేణులు యాదావిధిగా సభను కొనసాగించాయి. అయితే ఈ రోజు సాయంత్రం ఏపీలో అమిత్ షా పర్యటన యదావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర భేటీ నేపథ్యంలో తన వరంగల్, కరీంగనర్ సభలను రద్దుచేసుకున్నారు అమిత్‌షా. కాగా ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories