ఏపీ కొత్త గవర్నర్‌గా సుష్మస్వరాజ్! వార్తలపై సుష్మా స్పందన

ఏపీ కొత్త గవర్నర్‌గా సుష్మస్వరాజ్! వార్తలపై సుష్మా స్పందన
x
Highlights

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్‌లను నియమించబోతున్నారంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సోమవారం ఢిల్లీలో కేంద్ర...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్‌లను నియమించబోతున్నారంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమావేశం తరువాత ఈ వార్త మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఏపీ గవర్నర్‌గా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ఓ రేంజ్‌లో హల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పదిగంటలకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ ట్వీట్ చేస్తూ ఏపీ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. దీంతో ఈ వార్తకు మరింత ఉపందుకుంది. అయితే, ఆ తర్వాత కాసేపటికే మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఏపీ గవర్నర్‌గా తనను నియమిస్తున్నారనే వార్తలు జోరందుకోవడంతో ఈ విషయమై సుష్మా స్వరాజ్ స్పందించారు. తనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తారని వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె తేల్చి చెప్పారు. ఈ విషయమై సుష్మా ట్వీట్‌ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు, సుష్మా అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories