నన్ను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారు: కన్నా

Kanna Laxmi Narayana
x
Kanna Laxmi Narayana
Highlights

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ధర్నా చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories