జగన్‌-కేసీఆర్‌ దోస్తీపై మంత్రి అఖిలప్రియ ఫైర్

జగన్‌-కేసీఆర్‌ దోస్తీపై మంత్రి అఖిలప్రియ ఫైర్
x
Highlights

పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. అలాంటి జగన్‌ అధికారంలోకి...

పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. అలాంటి జగన్‌ అధికారంలోకి వస్తే తన కేసుల మాఫీ కోసం ఇంకేం తాకట్టు పెడతారోనని ఎద్దేవా చేశారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా చాగలమర్రి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అఖిల ప్రియ భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం కంచుకోట లాంటిదని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నీనా కానీ ఏపీలో మళ్లీ తెలుగుదేశం జెండా రేపరేపలాడుతుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పథకాలే 2019ఎన్నికల్లో విజయానికి కారణమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories