రాష్ట్రాన్ని అభివ‌ృద్ధి చేసినా.. ప్రజలు వైసీపీకి ఒటేసారు. బాలకృష్ణ

రాష్ట్రాన్ని అభివ‌ృద్ధి చేసినా.. ప్రజలు వైసీపీకి ఒటేసారు. బాలకృష్ణ
x
Highlights

హిందూపురం టీడీపీకి కంచుకోటని మరోసారి రుజువయ్యిందన్నారు బాలకృష్ణ. అయన ఈరోజు హిందూపురం పర్యటనలో ఉన్నారు చిలమత్తూర్, లేపాక్షిలో జరిగిన ఎన్టీఆర్ జయంతి...

హిందూపురం టీడీపీకి కంచుకోటని మరోసారి రుజువయ్యిందన్నారు బాలకృష్ణ. అయన ఈరోజు హిందూపురం పర్యటనలో ఉన్నారు చిలమత్తూర్, లేపాక్షిలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో అయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు బాలకృష్ణ..

ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు బాలయ్య. రాష్ట్రాన్ని అభివ‌ృద్ధి చేసినా.. ప్రజలు వైసీపీకి ఓటు వేయడం బాధ కలిగిస్తోందన్నారు. గతంకంటే తనని ఎక్కువ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయినా టీడీపీకి కార్యకర్తలే బలం.. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తలున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో వారికి అండగా ఉంటానని భరోసా నింపే ప్రయత్నం చేశారు.

హిందూపురం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేయడానికి తనకు అవకాశం కల్పించారని.. ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. హిందూపురం అభివృద్ధికి చంద్రబాబు ఎన్నో నిధులిచ్చి అభివృద్ధికి సాయపడ్డారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధికి, పోరాటం చేస్తానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories