వైసీపీకి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు: ఒవైసీ

వైసీపీకి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు:  ఒవైసీ
x
Highlights

ఏపీలో పొలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బీజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది కొన్ని...

ఏపీలో పొలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బీజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది కొన్ని సర్వేలు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఏపీ సీఎం విషయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారని అసదుద్దీన్‌ ఒవైసీ అన‍్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఓ చారిత్రక అవసరమని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అంటే ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను అన్నవిధాలుగా మోసం చేశారన్నారు. ముస్లింలకు చంద్రబాబు చేసినంత అన్యాయం మరెవ్వరూ చేయలేదని ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు రాజకీయ అవసరం కోసం బీజేపీని తిడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు రెండుసార్లు పొత్తు పెట్టుకుని, వైఎస్‌ జగన్‌కి, మోదీకి పొత్తు ఉందని విషప్రచారం ఒవైసీ విమర్శించారు. చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ నమ్మరని, ఆయన పచ్చి రాజకీయ అవకాశవాది అని విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories