కాసేపట్లో ఏపీ టెన్త్‌ ఫలితాలు

కాసేపట్లో ఏపీ టెన్త్‌ ఫలితాలు
x
Highlights

కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేస్తారు. గ్రేడ్‌లు,...

కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేస్తారు. గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్లు, జీపీఎల్‌ విభాగాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కౌంటింగ్‌ ప్రక్రియ చాలాకాలం క్రితమే పూర్తైంది. అయితే ఫలితాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, తప్పులకు అవకాశం ఇవ్వకుండా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 6 లక్షల 17 వేల 484 మంది విద్యార్థులు హాజ‌రయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories