ఏపీ ఒలింపిక్‌ నూతన కార్యవర్గ ఏర్పాటు...చైర్మన్‌గా...

ఏపీ ఒలింపిక్‌ నూతన కార్యవర్గ ఏర్పాటు...చైర్మన్‌గా...
x
Highlights

ఆంద్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటైంది. చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌,...

ఆంద్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటైంది. చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి, అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ప్రదాన కార్యదర్శిగా పురుషోత్తం ఎన్నికయ్యారు. వారితో పాటు 8 కమిటీలను, పలు అనుబంధ కమిటిలను ఏర్పాటు చేస్తున్నట్టు అసోషియేషన్‌ ఎన్నిక కమిటీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈసందర్భంగా ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యేగా కంటే క్రీడాకారుడు గానే చెప్పుకోవడమే ఇష్టమన్నారు. నిజాయితీగా పని చేసే జగన్ ప్రభుత్వం వచ్చిందని ఇక క్రీడల అభివృద్ధికి పని చేయాల్సి ఉందన్నారు. ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. మిగిలిన గొడవలు అన్నీ వదిలేసి.. క్రీడల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని కొత్త కమిటీలకు ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories