జగన్ కాశీ యాత్ర చేసుకుంటే మంచిది...అక్కడ జగన్‌కు ప్రధాని మోడీ తోడవుతారు

devineni
x
devineni
Highlights

వైసీపీ అధినేత జగన్‌‌పై మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. జగన్ కాశీ యాత్ర చేసుకోవాలని సూచించారు. కాశీలో జగన్ కు ప్రధాని మోడీ తోడవుతారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జగన్‌ చేసిన ప్రసంగంపై దేవినేని విమర్శలు గుప్పించారు.

వైసీపీ అధినేత జగన్‌‌పై మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. జగన్ కాశీ యాత్ర చేసుకోవాలని సూచించారు. కాశీలో జగన్ కు ప్రధాని మోడీ తోడవుతారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జగన్‌ చేసిన ప్రసంగంపై దేవినేని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్‌ మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని ఆరోపించారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే అబద్ధాలు ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడారా? అని నిలదీశారు. నిన్నటి జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించిందన్నారు. జగన్‌, కేసీఆర్‌, మోడీ కుమ్మక్కయ్యారని, వీరి మాటలను జనం నమ్మేస్థితిలో లేరని దేవినేని ఉమా విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories