ఏపీ ప్రజల డేటా ఎక్కడా లీక్‌ కాలేదు: విజయానంద్

ఏపీ ప్రజల డేటా ఎక్కడా లీక్‌ కాలేదు: విజయానంద్
x
Highlights

ఆధార్‌ డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదని ఏపీ ఐటీ సెక్రటరీ విజయానంద్‌ స్పష్టం చేశారు. ప్రజాసాధికార సర్వేలో డేటా భద్రంగా ఉందని ఆయన తెలిపారు. ఈ డేటా...

ఆధార్‌ డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదని ఏపీ ఐటీ సెక్రటరీ విజయానంద్‌ స్పష్టం చేశారు. ప్రజాసాధికార సర్వేలో డేటా భద్రంగా ఉందని ఆయన తెలిపారు. ఈ డేటా సమాచారాన్ని ఎవరైనా అడిగితే వెబ్‌ సర్వీస్ ద్వారా అందిస్తామని చెప్పారు. ఏదైనా ప్రభుత్వ శాఖ అడిగితే డేటా ఇస్తామని, డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం లేదని తెలిపారు. డేటా చోరీకి ఎవరైనా ప్రయత్నిస్తే తమకు సమాచారం వస్తుందని విజయానంద్ తెలిపారు. డేటా ఎక్కడా లీక్‌ కాలేదని, అన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. ఏపీ ప్రజల డేటా సురక్షితంగా ఉందని, డేటా భద్రతకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఐటీ సెక్రటరీ విజయానంద్‌ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories