సీఎం వైఎస్‌ జగన్‌తో డీజీపీ సవాంగ్‌ భేటీ

సీఎం వైఎస్‌ జగన్‌తో డీజీపీ సవాంగ్‌ భేటీ
x
Highlights

ఏపీ సీఎం జగన్‌తో కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు పలు అంశాలపై చర్చించారు. గౌతమ్ సవాంగ్ రేపు డీజీపీ‌గా బాధ్యతలు...

ఏపీ సీఎం జగన్‌తో కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు పలు అంశాలపై చర్చించారు. గౌతమ్ సవాంగ్ రేపు డీజీపీ‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం ఆర్పీ ఠాకూర్‌కు వీడ్కోలు పలకడంతో పాటు గౌతమ్‌ సవాంగ్ కు స్వాగతానికి పోలీస్ దళాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆర్పీ ఠాకూర్ సెలవులపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీజీపీ నుంచి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేయడంపై ఆర్పీ ఠాకూర్‌ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆర్పీ ఠాకూర్ కేంద్ర సర్వీసెస్‌కు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories